బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్ర పాలనపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హితవు పలికా రు. కుట్రపూరితంగా బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ పూర్తి కాలేదని, రాష్ట్రంలో పత్తిపంటకు మ ద్దతు ధర రావడం లేదని విమర్శించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాల ని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎప్పటిలోగా ఇస్తారో రైతులకు రే వంత్రెడ్డి సమాధానం చెప్పాలన్నా రు.
ఎన్నికల ముందు సోషల్ మీడి యా యూనివర్సిటీ పెట్టి బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేశారని, ఎన్నికల హామీలు అమలు చేయాల ని మహేశ్ కుమార్, రేవంత్రెడ్డికి సూచించారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్లో ఏం జరిగిందో చెప్పాల ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొడానికి తాము సిద్ధం గా ఉన్నామని స్పష్టం చేశారు