17-04-2025 12:00:00 AM
మందమర్రి, ఏప్రిల్ 16 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ, రాజకీయం పేరుతో చట్టాలను దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోత్కు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్, మంద తిరుమల్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ సంబంధించిన మనీ లాండ రింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, అన్ని రాష్ట్రాల్లోని జిల్లా స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కోల్ బె ల్ట్ రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.
ఈ సంద ర్భంగా కేంద్రప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కేంద్ర సంస్థల అధికారాలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. షీట్ దాఖలు చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయంగా ప్రేరేపితమైనదని స్పష్టమవుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.