04-04-2025 12:59:10 AM
జగిత్యాల, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపాతని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పేర్కొ న్నారు. కోరుట్ల మండలంలోని సంగెం, గుమ్మలాపూర్, వెంకటాపూర్ గ్రామాలలో గురువారం జరిగిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అంతకుముందు గుమ్ములాపూర్ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ భవన ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ. 2 లక్షలు మంజూరవగా, సంబంధిత మంజూరు పత్రాన్ని సంఘ సభ్యులకు అందజేశారు.
కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోయినపల్లి సత్యనారాయణరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజమ్, తన కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్’గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు గడ్డం వెంకటేశంగౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖల అధ్యక్షుడు శంకర్, చిట్టిబాబు, విట్టల రవీందర్ రెడ్డి, బర్గం నరసయ్య,
వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు రాజేష్, మండల కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎండి.నబి, సంగేం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరస తుకారం, మాజీ ఎంపీటీసీ సభ్యులు పోతుగంటి వెంకట్ గౌడ్, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.