calender_icon.png 22 October, 2024 | 5:58 PM

మీకు .. మీ.. పార్టీ కో దండం

22-10-2024 03:11:25 PM

కరీంనగర్, (విజయక్రాంతి): తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని కోల్పోవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. మీకు.. మీ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ నాయకుడు గంగారెడ్డి హత్యకు గురికావడంతో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్షన్ కుమార్ జీవన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా జీవన్‌ రెడ్డిపై విధంగా వ్యాఖ్యానించారు. జీవన్‌ రెడ్డికి టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఫోన్‌ చేశారు. గంగారెడ్డి మరణం నేపథ్యంలో జీవన్‌ రెడ్డిని పరామర్శించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీపై జీవన్‌ రెడ్డి అసహనంగా ఉండటంతో ఆయన్ను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ జీవన్‌ రెడ్డి వినిపించుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు కొనసాగాలని మహేశ్‌ కుమార్‌ను ఎదురు ప్రశ్నించారు. చంపించుకోవడానికే పార్టీలో ఉన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా ఫోన్‌ను పక్కన పడేయడం హాట్ టాపిక్ గా మారింది.