calender_icon.png 24 September, 2024 | 4:49 PM

అభివృద్ధిలో అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ముందంజలో ఉంచుతాం

24-09-2024 02:29:07 PM

ముత్తారం,(విజయక్రాంతి): అభివృద్ధిలో అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ముందంజలో ఉంచుతానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హమీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, తాజా మాజీ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణిబాలాజీ దంపతులు తెలిపారు. ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని టీ ఫైబర్ ఇంటింటికి ఇంటర్నెట్ పైలెట్ ప్రాజెక్టు కింద అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబును కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ముత్తారం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మంత్రిని కోరినట్లు బాలాజీ పేర్కొన్నారు.