03-02-2025 12:15:45 AM
ఆహ్వానించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి) : అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు నాయకులు ఎందుకు చేరుతున్నారో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలి కష్ణ తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు.
పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మునుముందు ప్రజా సమస్యలను పరిష్కరించేలా ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో ఉన్నారు.