01-04-2025 02:06:12 AM
మేడ్చల్, మార్చి 31 (విజయ క్రాంతి): రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రాష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. షామీర్పేట్ లో తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ ముసుబుద్దిన్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మహమ్మద్ షాహి హుద్దీన్ నివాసంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, ఆర్ టి ఏ నెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, వేముల మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.