హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో స్టేజీ కుప్పకూలింది. పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ఝాన్సీరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వేదికపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఝాన్సీరెడ్డికి తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.