న్యూఢిల్లీ,(విజయక్రాంతి): హర్యానాలో ఎన్నికల ఫలితాల ఆలస్యంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ఎన్నికల ఫలితాల ఆలస్యంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని జైరాం పేర్కొన్నారు. హర్యానాలో 10-11 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. కానీ ఈసీ వెబ్ సైట్ లో మాత్రం 4-5 రౌండ్ల ఫలితాలు వివరాలే ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన విభాగంపై ఒత్తిడి పెంచేందుకు ఇదొక ఎత్తుగడ అని, ఆట అప్పుడే ముగియలేదు.. నిరుత్సాహపడనక్కర్లేదు అని రమేశ్ అన్నారు. మైండ్ గేమ్ ఆడుతున్నారని.. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జైరాం రమేశ్ తెలిపారు.