calender_icon.png 24 October, 2024 | 10:06 PM

కాంగ్రెస్ నేత దారుణహత్య

05-05-2024 12:53:26 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (విజయ క్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల వేళ నగర శివారులో సంచలన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌లోని అసద్‌నగర్, ఇందిరానగర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్నర్ మీటింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎండీ మక్బూల్‌ను, వెనుకనుంచి వచ్చిన అంజాద్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. సభ నుంచి తరుముకుంటూ వెళ్లి వెంటాడి మరీ అందరూ చూస్తుండగానే గొంతుకోసి హత్య చేశాడు. దుండగుడు వెంటడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. దీంతో అక్కడికక్కడే కుప్పుకూలిపోయిన ఎండీ మక్బూల్‌ను స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.