మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): నల్లగొండకు మూసీ ద్వారా తాగునీ రు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎలా కడుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీకి కాంగ్రె స్ బీ టీమ్గా పనిచేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో మోదీ, రేవంత్ మిలాఖత్ స్పష్టం అవుతోందని దుయ్యబట్టారు. బుధవా రం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదానీ ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చూస్తున్నారని, అదే జరిగితే రామన్నపేట మండలం ఆగమవుతుందన్నారు.
ఒకవేళ సిమెంట్ ఫ్యాక్టరీ కడితే.. మూగజీవాలకు కూడా గడ్డి దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అవసరమైతే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకున్న కోదండరాం, హరగోపాల్ ఇప్పుడు మూసీపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్లో కర్ణాటక నేతలపై చర్యలు తీసుకున్న ఈడీ తెలంగాణలో ఎందుకు విచారణ చేయడం లేదన్నారు.