calender_icon.png 14 October, 2024 | 8:13 AM

రైతును విస్మరిస్తున్న కాంగ్రెస్

14-10-2024 01:25:59 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): బూటకపు హామీలతో రైతు లను, సామాన్య ప్రజానీకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుం టున్నారన్నారు.ఆదిలాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మట్లాడారు.

రైతుల పక్షాన ప్రభు తాన్ని నిలదీసేందుకు ఈ నెల 24న జిల్లా కేంద్రంలో నిరహించే నిరసన కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నా రని తెలిపారు. ఈ  కార్యక్రమన్ని విజ యవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.