కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శ
హైదరాబాద్, జూలై 14 (విజయ క్రాంతి) : రాష్ట్రంలోని నిరుద్యోగ యువత బీఆర్ఎస్ పాలనలో లీకేజీలతో ద్రోహానికి గురైందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంతో నిర్లక్ష్యానికి గురవుతు న్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి విమర్శించారు. గ్రూప్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి హైదరాబాద్, అశోక్నగర్లో నిరుద్యోగులు చేసిన భారీ ర్యాలీ వీడియోను ఎక్స్లో కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దపు, అమలుకు నోచుకోని హామీలు, విఫలమైన గ్యారెంటీలు, రాజకీయ మోసం అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారు పాలనలో పేపర్ లీకేజీల వల్ల నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారని, ఇప్పుడు రేవంత్ పాలనలో అమలుకాని హామీలతో వంచనకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొ న్నారు. నిరుద్యోగుల వేదనను ఈ ప్రభు త్వం అర్థం చేసుకోవడం లేదని, అందుకే వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.