calender_icon.png 23 October, 2024 | 7:07 PM

విమోచనంపై కాంగ్రెస్‌ది ద్వంద వైఖరి

18-09-2024 01:31:58 AM

మెదక్ ఎంపీ రఘునంధన్ రావు

సిద్దిపేట, సెప్టెంబరు 17 (విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి ప్రదర్శిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట బీజేపీ కార్యా లయంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో రఘునందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే తెలం గాణలో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోహ న్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దినేష్, నాయకులు.. విద్యాసాగర రావు, విభిషన్ రెడ్డి, బాలేష్ గౌడ్, సురేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.