calender_icon.png 20 September, 2024 | 5:19 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి

19-09-2024 05:15:00 PM

సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ 

సిద్ధిపేట,(విజయకాంతి): రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో పట్టణంలోని 9వ వార్డులో ఆర్పీలతో కలిసి సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మంజూరు పత్రాలను కాలనీ ప్రజలకు  అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ అందుతున్నాయని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే వెనక్కి తగ్గదని ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకు అందించినట్లు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తున్నామని అన్నారు. అర్హులు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా పథకాలను అందజేస్తామని అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా కార్యకర్తలకు అన్ని పథకాలు అందించలేదని తామే ముందుండి వెళ్ళిన ప్రజలకు అందజేస్తున్నాం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని అన్నారు.

గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుచేసినామని అరులైన అందరికీ పథకాలు అంది ఇస్తామని అన్నారు. ఎవరికైనా అర్హులుగా ఉండి ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.  మతతత్వ పార్టీని కేంద్రం నుండి గద్దె దింపుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజెపి పార్టీలో కోలుకోవడం కష్టమేనని అన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు అరులైన వారు అందరూ మళ్లీ అప్లై చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గాయాగుద్దిన్ తదితరులు పాల్గొన్నారు