20-03-2025 01:03:07 AM
వనపర్తి, మార్చి 19 ( విజయక్రాంతి ) : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 3,04,965 కోట్లు ప్రజా బడ్జెట్ ను బుధవారం రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని ఈ బడ్జెట్ ప్రజా ఆమోద బడ్జెట్ అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి బుధవారం ఒక ప్రకటన ద్వారా అన్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూపొందించిన బడ్జెట్ అన్ని రంగాలకు ఆమోదయోగ్యంగా ఉందని, అన్ని రంగాలను త్వరితగతిన అభివృద్ధిపరిచేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, నీటిపారుదుల రంగం, గ్రామీణ అభివృద్ధి రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించడం హర్షనీయమన్నారు.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి