calender_icon.png 20 September, 2024 | 2:27 PM

ప్రజాపాలనలో సర్కార్ నౌకర్లకు తప్పని తిప్పలు

20-09-2024 11:14:58 AM

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఆరోపించారు. ఉద్యోగులకు నగదు రహిత చికిత్సపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఉద్యోగులకు నగదు రహిత చికిత్సపై వచ్చిన వార్తను కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టు జీవోను అమలు చేయట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరితో 20 లక్షల కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా కేసీఆర్ సర్కార్ చూసిందని ఆయన గుర్తుచేశారు. వైద్యానికి డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడ్తున్నదని మండిపడ్డారు. తక్షణం తమ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేసి ఉద్యోగులకు ఉపశమనం కలిగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.