calender_icon.png 24 September, 2024 | 4:00 AM

హైడ్రా పేరుతో కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్

24-09-2024 01:47:00 AM

ఎంపీ డీకే అరుణ 

నారాయణపేట, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా హామీలు అమలు చేయకుండా, హైడ్రా పేరులతో ప్రజలను డైవర్ట్ చేస్తున్నదని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. వికారాబాద్ జిల్లా కోస్గిలో సోమవారం ఆమె బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు. హామీల అమలులో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదని, మహిళలకు 2500 పెన్షన్ అందలేదని గుర్తుచేశారు. హామీల అమలు చేతకాక హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. కొడంగల్‌లో అభివృద్ధి పేరుతో దేవాదాయ భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు.  ఫార్మా సిటీ కోసం బలవంతంగా భూములు లాక్కుంటే ఉరుకోబోమని హెచ్చరించారు.