calender_icon.png 21 September, 2024 | 3:20 AM

పేదలపై కాంగ్రెస్‌ది నిర్లక్ష్య వైఖరి

21-09-2024 12:45:41 AM

బీజేపీ ఎస్సీ సెల్ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): తొలి నుంచే రాహు ల్ గాంధీ కుటుంబం పేదల పట్ల నిర్లక్ష్య వైఖరే అవలంబిస్తుందని బీజేపీ ఎస్సీ సెల్ జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగి స్తామంటూ అమె రికా వేదికగా రాహుల్ గాంధీ వ్యా ఖ్యానించారని   ఆగ్రహం వ్యక్తం చేశా రు. పార్టీ ఆఫీస్‌లో ప్రధాన కార్యదర్శి బంగా రు శ్రుతి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షు డు కొండేటి శ్రీధర్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లా డారు. విదేశీ గడ్డపై భారత రాజ్యాం గాన్ని  రాహుల్ గాంధీ అపహాస్యం చేసేలా మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ నైజాన్ని అమెరికా గడ్డపై నుంచి రాహుల్ ప్రపంచానికి చెప్పారని తెలిపారు. పేదల హక్కుల గురించి ఏనాడు కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు.