calender_icon.png 29 September, 2024 | 2:58 AM

మున్సిపాలిటీ బడ్జెట్‌పై గందరగోళం!

29-09-2024 12:54:34 AM

  1. సమావేశానికి చైర్మన్, వైస్‌చైర్మన్ డుమ్మా
  2. పోడియం చైర్మన్‌తో బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో శ నివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి చైర్మన్, వైస్‌చైర్మన్ హాజరుకాకపోయినా పోడియం చైర్మన్‌ను నియమించి బడ్జెట్‌ను ఆమోదింపజేశారు. దసరాను పురస్కరించుకుని నిధుల విడుదల, చేసిన పనుల కు బిల్లుల ఆమోదం కోసం శనివారం మున్సిపల్ కమిషనర్ నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో సమావే శాన్ని ఏర్పాటు చేశారు.

చైర్మన్ కల్ప న, వైస్ చైర్మన్ బాబురావు సమావేశానికి డుమ్మా కొట్టారు. సమావేశం వాయిదా పడుతుందని అందరూ భావించారు. మెజారిటీ కౌన్సిలర్లు హాజరు కావడంతో సీనియర్ కౌన్సిలర్ శ్రీనివాసులును తాత్కాలిక (పోడియం) చైర్మన్‌గా నియమించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దసరా పండగకు సంబంధించిన బడ్జెట్ మాత్రమేనని చెప్పి ఇతర నకిలీ బిల్లులకు కూడా ఆమోదం పొందేలా అధికారులు ప్రణాళిక రచించారని ఇతర కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.