10 మందిపై కేసు నమోదు
ఎల్బీనగర్, అక్టోబర్ 16 : ఇరు కుటుంబాలకు చెందిన వివాదంలో ఇతరులు జోక్యం చేసుకోవడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని పలువురిపై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాత నాగోల్ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే వీరి వివాదంలో ఇతరులు జోక్యం చేసుకుంటూ సమస్యను మరింత జఠిలంగా మారుస్తున్నారు.
ఫలితంగా గ్రామంలో శాంతిభద్రతలకు విఘా తం కలుగుతోంది. ఈ క్రమంలో ఈనెల 13న ఇరుకుటుంబాల మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు తెల్లవారుజామున ఇరువర్గాలు పరస్ప ం ఫిర్యాదు చేయడానికి నాగోల్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఇరువర్గాల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పదిమందిపై కేసు నమోదు చేశారు. ఒక్కో కుటుంబం నుంచి ఐదుగురిని బైండోవర్ చేశారు.