ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంజిఎంఆర్ ఈజిఎస్ 15వ విడత సామాజిక తనిఖి నిర్వహించారు. ప్రజా వేదికను జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవి ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పటి వరకు జరిగిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎం సాయి జ్ఞానేందర్, జిల్లా విజిలెన్స్ అధికారి రమణ, ఎంపీడీవో రవీంద్ర రావు, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి అనూష, అంబుడ్స్ మెన్ ప్రకాష్, క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రకాష్, ఎంపీఓ గాంధీ, స్టేట్ రిసోర్స్ పర్సన్ ఏ రమేష్, ఏ పీ ఓ కాలంగి శ్రీనివాస్, ఈ సి తిరుపతయ్య, కార్యదర్శులు, ఉపాది హమి సిబ్బంది పాల్గొన్నారు.