calender_icon.png 16 October, 2024 | 8:56 PM

ముగిసిన సింగరేణి స్థాయి క్రీడలు..

16-10-2024 06:27:13 PM

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్, ఇల్లందు ఏరియా వారి ఆధ్వర్యంలో  వై.సి.ఓ.ఎ క్లబ్, 24 ఏరియా, సింగరేణి స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి బాస్కెట్ బాల్, లాన్ టెన్నిస్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో  ఇల్లందు ఏరియా జి.యం.జాన్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ.. ఈ పోటీలలో గెలుపొందిన  క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

అదే విధంగా ఓడిపోయిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరింత కసరత్తులు చేయాలని కోరారు. తదుపరి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కోల్ ఇండియా లెవెల్ లో జరిగే పోటీలలో సింగరేణి కంపెనీ ఖ్యాతిని చాటాలని కోరారు. అనంతరం 6 రీజియన్ ల క్రీడాకారులందరూ ఏరియా జియం జాన్ ఆనంద్ ను ఘనంగా సన్మానించారు. ఈ  కార్యక్రమంలో ఎస్.ఓ.టు. జి.యం బొల్లం వెంకటేశ్వర్లు, అధికారుల సంఘం అధ్యక్షుడు ఎ.జి శివ ప్రసాద్, డిజిఎం పర్సనల్ జి.వి.మోహన్ రావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు జే.వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ సూపర్ వైజర్స్ పాస్నేట్, రమేష్, పార్స శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయి స్వరూప్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రమేష్ సింగ్, జనరల్ కెప్టెన్ అన్వర్ ఇతర క్రీడాకారులు  పాల్గొన్నారు.