ఫరియా అబ్దుల్లా మరో కొత్త బాటలో ప్రయాణం ప్రారంభించింది. ఇటీవల విడుదలైన ‘మత్తు వదలరా 2’ సినిమాతో తాను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గీత రచయిత్రిగా, గాయకురాలిగా, కొరియోగ్రాఫర్గా మారి తన అభిమానులకు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
ఇదే జోష్ కొనసాగిస్తూ సింగర్గా కెరీర్ ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ ర్యాపర్ ‘బ్రోధ’తో కలిసి ఫరియా తన మ్యూజిక్ జర్నీ ప్రారంభించినట్టు తెలుస్తోంది. మ్యూజిక్ ప్రపంచానికి రాపర్గా, గీత రచయితగా, సంగీత నిర్మాతగా సుపరిచితుడైన బ్రోధ అసలు పేరు విఘ్నేశ్ శివానంద్. తాను తాజాగా పాల్గొన్న సంగీత కచేరీ విషయాన్ని ఫరియా స్వయంగా వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఇన్స్టాలో పంచుకుంది. ‘నేను నా మొట్టమొదటి సంగీత కచేరీని ‘బ్రోధతో కలిసి ప్రారంభించాను. రెండు కొత్త పాటలను విడుదల చేశాను. నాతో కలిసి ప్రదర్శనలు ఇవ్వడానికి అద్భుతమైన కళాకారులు దొరకడం నిజంగా చాలా ఆనందంగా ఉంది’ అని ఈ పోస్ట్లో రాసుకొచ్చింది ఫరియా. సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోల్లో ప్రముఖ హిప్హాప్ కళాకారుడు విఘ్నేశ్ శివానంద్తో కలిసి చాలా హుషారుగా పాటలు పాడుతూ కనిపించిందీ నిలువెత్తు అందాల గాన కోకిల.