calender_icon.png 27 September, 2024 | 1:02 PM

దుకాణాల కూల్చివేతపై ఆందోళన

27-09-2024 02:55:20 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 26: వనస్థలిపురంలోని రైతుబజార్ వద్ద బుధవారం పోలీసుల పహారాలో జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్డు ను అక్రమించిన పండ్లు, పూల దుకాణాలను కూల్చివేశారు. దీంతో గురువారం చిరువ్యాపారులు ఆందోళన చేపట్టారు. రైతుబజార్ ఏర్పడినప్పటి నుంచి తాము ఇక్కడే వ్యాపారం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిరువ్యాపారులపై కక్ష కట్టి మా దుకాణాలను కూల్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేనిది ఇప్పుడే ఉన్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు మాకు సమయం ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని.. వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన సామగ్రి, వస్తువులు, సరుకులు తీసుకోకుండానే దుకాణాలు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చడానికే రోడ్డును అక్రమించిన దుకాణాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.