calender_icon.png 21 September, 2024 | 5:47 AM

మనూలో విద్యార్థుల ఆందోళన

21-09-2024 12:15:00 AM

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు వడ్డిస్తున్న ఆహారం ఏమాత్రం నాణ్యత లేదని, దుర్వాసన వస్తోందంటూ శుక్రవారం సు మారు 400 మంది విద్యార్థులు ఆం దోళన చేపట్టారు. గత కొద్ది రోజులుగా సరైన ఆహారం సరఫరా చేయ డం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎన్నిమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.