calender_icon.png 22 September, 2024 | 7:05 AM

రేషన్ డీలర్ అభ్యర్థుల ఆందోళన

22-09-2024 01:40:02 AM

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకున్నారని అభ్యర్థులు ఆందోళన చేశారు. గత నెల 29న సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త రేషన్ షాపుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 58 కొత్త రేషన్ డీలర్ పోస్టులకు 830 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 15న 765 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆర్డీవో సమక్షంలో అధికారులు ఇంటర్యూలు నిరహించారు. రేషన్ డీలర్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ శనివారం ఆర్డీవో కార్యాలయం ఎదుట అభ్యర్థులు ఆందోళన చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు రేషన్ డీలర్ పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. రాత పరీక్ష సరైన విధంగా జరగలేదని, పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేయలేదన్నారు.