కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): దహెగాం మండలంలోని బిబ్రా గ్రామంలో తాగునీటి కోసం శుక్రవారం గ్రామస్థులు నిరసన తెలిపారు. గ్రామం లో మిషన్ భగీరథ ట్యాంక్ నిండా నీరు ఉన్నప్పటికీ పైప్లైన్ సక్రమం గా లేక పోవడంతో ఎస్సీ కాలనీలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్కు వినతిపత్రమిచ్చినా ప్ర యోజనం లేదన్నారు. సమస్యను పరిష్కరించకుంటే కలెక్టరేట్ను ము ట్టడిస్తామని హెచ్చరించారు.