calender_icon.png 10 October, 2024 | 2:53 PM

భూ కేటాయింపును పూర్తి చేయండి

09-10-2024 12:00:00 AM

కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష

మంథని, అక్టోబర్ 8 (విజయక్రాంతి): మంథని మండలంలో అభివృద్ధి పనులకు భూ కేటాయింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంథని ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు గుర్తించిన ప్రభుత్వ భూములను సంబంధిత శాఖలకు బదలాయించాలని సూచించారు.

మంథని పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి మూడెకరాలు, తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంతో పాటు రోడ్లు భవనాల శాఖ భవనాల నిర్మాణాల కోసం 2.21 ఎకరాలు, కళాభారతి భవనానికి 8 గుంటలు, కమ్యూనిటీ హాల్ భవనం, ఆర్ అండ్ బీ అతిథి గృహానికి ఎకరం, విద్యుత్ సబ్ స్టేషన్‌కు 30 గుంటలు, అడవిసోమనపల్లిలో సమీకృత గురుకులాలానికి 25 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో మంథని ఆర్డీవో హనుమానాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమాదేవి, కమిషనర్ మనోహర్, ఆర్ అండ్ బీ భావ్‌సింగ్ పాల్గొన్నారు.