04-03-2025 01:40:45 AM
రంగారెడ్డి, మార్చి 3 (విజయక్రాంతి) రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 57 ఫిర్యాదులు అందినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి,నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరు పుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి లో రెవెన్యూ శాఖ 34, ఇతర శాఖలు 23, మొత్తం 57 దరఖస్తులు అందాయి.
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.