17-12-2024 12:30:55 AM
రంగారెడ్డి, డిసెంబర్16 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 67 ఫిర్యాదులు రాగా అందులో రెవెన్యూ శాఖకు 52, ఇతర శాఖలకు 15 దరఖాస్తులు వచ్చాయి.