calender_icon.png 4 March, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

04-03-2025 01:52:07 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట. మార్చి 3 (విజయక్రాంతి) ః ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 25 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.  కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఆర్. డి. ఓ. రాంచందర్, ఎ. ఓ. జయసుధ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.