16-12-2024 11:48:26 PM
కలెక్టర్ రాజీవ్ గాందీ హనుమంతు...
నిజామాబాద్ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదికారులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాందీ హనుమంతు అదేశించారు. సమీకృత జిల్లా కార్యలయాల సముదాయ సమావేష మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణీ కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులను ప్రజావాణిలో ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆర్డివో సాయిగౌడ్, ఇంచార్జ్ డిపివో శ్రీనివాసులకు ధరఖాస్తులు చేశారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండ్డింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిప్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాందీ హనుమంతు అధికారులను ఆదేశించారు.