calender_icon.png 12 October, 2024 | 5:46 AM

సైలెన్ పెట్టలేదని పోలీసులకు ఫిర్యాదు

10-10-2024 12:13:22 AM

కామారెడ్డి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం వెంకటాపూర్ తండాకు చెందిన శాంతాబాయ్ అనే మహిళకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు గాంధారి పీహెచ్‌సీకి బుధవారం తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా సైలెన్ బాటిల్ ఎక్కించేందుకు సిబ్బంది అందుబాటులో లేరని పేర్కొనడంతో ఆందోళన చెందిన శాంతాబాయ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పీహెచ్‌సీ వైద్యుడు ప్రవీణ్‌కుమార్ ఇటీవల సరెండర్ కాగా అతని స్థానంలో ఇప్పటి వరకు ఎవరు నియమితులు కాలేదు. దీంతో రోగులకు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు.