19-09-2024 12:28:42 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 18 (విజయక్రాంతి): హుస్సేన్ సాగర్ను ఆక్రమించుకుని జలవిహార్ అక్రమ కట్టడాలు, పర్యావరణ ఉల్లంఘనలను పరిశీలించి హైడ్రా తక్షణం చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేశ్ వినతిపత్రం అందజేశారు.