calender_icon.png 21 September, 2024 | 2:55 PM

దానంపై డీజీపీకి ఫిర్యాదు

21-09-2024 02:47:01 AM

 హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మండి ఎంపీ, ప్రముఖ సినీ నిటీ కంగనా రనౌత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ మహిళా మోర్ఛా నేతలు శుక్రవారం డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. దానం గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలిచారని, అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోలేదని బీజేపీ మహిళా మోర్ఛా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి అన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా దానంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.