calender_icon.png 1 March, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై అత్యాచారం ఘటనపై కలెక్టర్, ఎస్పీకి రాజకీయ నేతల ఫిర్యాదు..

01-03-2025 07:04:57 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): అదిలాబాద్ లోని ఓ కాలనిలో ఇటీవల ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరిని కఠినంగా శిక్షించాలని ఆయా రాజకీయ పార్టీల మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ అలం లను కలిసి విన్నవించారు. బాధిత బాలిక ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను త్వరలో కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాజిద్ ఖాన్, నజీర్, సాజిదోద్దీన్ తదితరులు ఉన్నారు.