23-02-2025 12:04:24 AM
కరీంనగర్,(విజయక్రాంతి): అధికార దుర్వినియోగానికి పాల్పడిన గన్నేరువరం ఎస్ఐ తాండ్ర నరేష్ను సస్పెండ్ చేయాలని బాధితుడు అచ్యుత్ గౌడ్ కోరారు. ఈ మేరకు శనివారం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. జిల్లాలోని గన్నేరువరం ఎస్ఐ తాండ్ర నరేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడి తనపై అకారణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి, విచక్షణ రహితంగా చిత్రహింసలు పెట్టి, దూషించారని, దీనిపై సీపీకి ఈ నెల 18న పోస్టు ద్వారా ఫిర్యాదు చేశానని తెలిపారు. తనను తాగుబోతులా చిత్రీకరించే విధంగా ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో కాంప్రమైజ్ కాకపోతే నీ అంతుచూస్తానని ఎస్ఐ బెదిరిస్తున్నాడని, అందుకే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.