నిర్మల్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ సత్యంపై సోమవారం ఇద్దరు కౌన్సిలర్లు ఆదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో రూ.4.8 కోట్లు నిధులు విడుదలయితే.. అన్ని వార్డులకు కేటాయించకుండా తన సొంత వార్డుకు రూ.1.09 కోట్లు కేటాయించుకుని ఇతర వార్డులపై వివక్ష చూపుతున్నారని కౌన్సిలర్లు ఖలీల్, సంకీర్తన ఆరోపించారు. తమ వార్డులను పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై విచారణ జరపాలని కోరారు.