ప్రజాసంఘాల జేఏసీ రాష్ర్ట అధ్యక్షుడు భాస్కర్
కోరుట్ల, ఆగస్టు 11 : జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో ఇటీవల మృతిచెందిన విద్యార్థుల కుటుం బాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజాసం ఘాల జేఏసీ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్ కోరారు. ఆదివారం పెద్దపూర్ గురుకులాన్ని ఆయన సంద ర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ౫౪౦ మంది విద్యార్థులు ఉన్న గురుకులంలో ౧౫ రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని అన్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల మృతిపట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు సానుభూతి ప్రకటించి ఊరుకోకుండా.. విద్యార్థులకు రక్షణ కల్పించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గురుకులానికి పూరవైభవం తేవాలని కోరారు.