మంత్రి శ్రీధర్బాబుకు ముత్తారం రైతుల వినతి
మంథని, జూలై28 (విజయక్రాంతి): మహారాష్ట్ర నుంచి విజయవాడకు నూతనంగా నిర్మిస్తున్న ఎన్హెచ్. రోడ్డులో భూములు కోల్పోతున్న పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల రైతులు ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును హైదరాబాద్లో కలిశారు. ఎకరానికి రూ.20 లక్షల నష్టపరిహారం ఇప్పించి, ఆదుకోవాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫోన్చేసి మాట్లాడారు. రామగిరి మండల రైతులకు ఇస్తున్న పరిహారం మాదిరిగానే ముత్తారం మండల రైతులకు అందేలా చూడాలని కోరారు. కలెక్టర్ సానుకులంగా స్పందించారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొడ్డ బాలాజీ, రైతులు ఉన్నారు.