calender_icon.png 26 October, 2024 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారుణ్య నియామకాలు చేపట్టాలి

30-08-2024 12:35:04 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): జిల్లా పరీషత్ కార్యాలయాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని  టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు గురువారం డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2016 నుంచి కారుణ్య నియామకాలు నిలిచిపోయాయన్నారు. దీంతో అర్హులందరూ తమ కుటుం బాలను పోషించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో బి.భాగ్య, ఆర్.నాగమణి, ఎస్. భరత్, సంతోష్, రాహుల్, విజయరెడ్డి, శ్రీకృష్ణ, శ్రీకుమార్, కిరణ్‌కుమార్, మీరాజ్, రామకృష్ణ, రమేష్, సాయికృష్ణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.