calender_icon.png 15 October, 2024 | 11:42 AM

ఐపీవోలకు 4 కంపెనీలు రెడీ

19-08-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఈ వారంలో నా లుగు కొత్త ఐపీవోలు ప్రారంభం కానున్నాయి. ఓరియంట్ టెక్నాలజీస్, ఇంటర్‌ఆర్క్ బిల్డింగ్‌లు మెయిన్ విభాగంలోనూ, బ్రేస్ పోర్ట్ లాజిస్టిక్స్, ఫోర్కాస్ స్టుడియో ఎస్‌ఎంఈ విభాగంలోనూ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు జారీచేస్తున్నాయి. ఈ కొత్త ఇష్యూలకు తోడు గతవారంలో ఆఫర్లు జారీచేసిన ఐదు కంపెనీలు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. వీటిలో సరస్వతి శారీ డిపో ఆఫర్ పట్ల ఇన్వెస్టర్లు బాగా ఆసక్తి చూపించారు. ఈ వారంలో ఇంటర్‌ఆర్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఐపీవో ఆ గస్టు 19న మొదలై ఆగస్టు 21న ముగుస్తుంది. రూ.1,186 కోట్ల సమీకరణకు వ స్తున్న ఈ ఐపీవో ధరను రూ.850 శ్రేణిగా నిర్ణయించారు. ఓరియంట్ టెక్నాలజీస్ ఐపీవో ఆగస్టు 21న ప్రారంభమై ఆగస్టు 23న ముగుస్తుంది. రూ.215 కోట్ల సేకరణకు వస్తున్న ఈ ఆఫర్ ధరను రూ.195 శ్రేణిలో నిర్ణయించారు. 

వచ్చే వారాల్లో మరో 25 ఐపీవోలు 

ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం పొందిన మరో 25 కంపెనీలు రానున్న కొద్ది వారాల్లో పబ్లిక్ ఆఫర్లు జారీచేయాలని వేచిచూస్తున్నాయి. ఈ కంపెనీలు మార్కెట్ నుంచి రూ. 22,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి.