calender_icon.png 23 October, 2024 | 10:02 AM

రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతుల కోసం కమిటీ

28-08-2024 12:00:00 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 27 (విజయక్రాంతి):  తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగుల పదోన్నతుల కోసం ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ప్ర మోషన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం స్టాంపులు, రి జిస్ట్రేషన్ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్, కమిషనర్ జ్యోతి బుద్ద ప్రకాశ్ ఉత్తర్వులు (జీవో జారీ చేశారు. ఈ కమిటీ మెంబర్ కన్వీనర్‌గా స్టాం పులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ కమిషనర్, సభ్యులుగా ఎక్సైజ్ శాఖ కమిషనర్, రెవెన్యూ శాఖ డిప్యూ టీ సెక్రటరీ/జాయింట్ సెక్రటరీ/అడిషనల్ సెక్రటరీలను నియమించారు. త్వరలోనే జరుగనున్న డీపీసీలో గ్రేడ్  సబ్ రిజిస్ట్రార్, గ్రేడ్ సబ్ రిజిస్ట్రార్‌లకు పదోన్నతులు కల్పించను న్నారని ఆ శాఖ అధికారులు తెలిపారు.