calender_icon.png 20 September, 2024 | 9:02 PM

హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం

20-09-2024 06:31:25 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. హిమాయత్ సాగర్ లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై సమీక్షించారు. ఇటీవల హిమాయత్ సాగర్ లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హిమాయత్ సాగర్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువడుతున్నాయని రంగనాథ్ పేర్కొన్నారు. ఫిర్యాదులు, సర్వే నివేదికపై కమిషనర్ సంబందిత అధికారులతో చర్చించారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ లోపు ఆర్డినెన్స్ రాబోతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. చాలా మంది హైడ్రాపై అనేక అనుమానాలు లేవనెత్తున్నారని, కొంతమంది కోర్టులను సైతం ఆశ్రయించారని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.