మెరుగైన వైద్యం అందించాలని సూచన
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శనివారం ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తనిఖీ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యము అందించాలని, పేషెంట్లను దగ్గరకెళ్ళి వారిని పరామర్శించారు. గత రెండు రోజులుగా తనిఖీలలో భాగముగా దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు, సౌకర్యాలు బాగున్నాయని అన్నారు. ఆస్పత్రి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ను, డాక్టర్ విజయలక్ష్మిని శాలువతో సన్మానం చేశారు. కార్యక్రమములో జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్లు వైద్వవి, శ్రీవాణి, దివ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.