calender_icon.png 1 April, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులతో రండి

25-03-2025 12:00:00 AM

  1. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ధ్యేయం
  2. లక్ష్యసాధనలో పారిశ్రామికరంగమే కీలకం
  3. స్కిల్స్ యూనివర్సిటీలో మార్కెట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా కోర్సులు
  4. యూఎస్-ఇండియానా ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహకాలను అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో యూఎస్-ఇండియానా సెక్రటరీ ఆఫ్ స్టేట్ డియోగో మోరాలెస్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు.

మెడికల్ డివెజైస్, ఔషధ పరిశ్రమ, జీవ విజ్ఞానం, వ్యవసాయం, తయారీ తదితర రంగాల్లో ఇండియానా రాష్ర్టంతో కలిసి పని చేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. ద్వుపాక్షిక సంబంధాల బలోపేతానికి తమ రాష్ర్టంలో పర్యటించాలని మంత్రి శ్రీధర్‌బాబును డియోగో మోరాలెస్ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరిం చి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ఇండియానాకు చెందిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని డియోగో మోరాలెస్ బృందాన్ని శ్రీధర్‌బాబు కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని వివరించారు.

ఈ లక్ష్యసాధనలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌కు హబ్‌గా మారుతున్న తెలంగాణ వైపు యావత్తు ప్రపంచం చూస్తోందన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించి, నాణ్యమైన మానవ వనరులను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామన్నారు. నిపుణులు, పరిశ్రమల భాగస్వా మ్యంతో ప్రస్తుత మార్కెట్ అవసరాలకు కోర్సులను అందిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో మోరాలెస్ సతీమణి సిడోనియా నికోల్, సోజోస్ క్యాపిటల్ సీఈవో ఫాబియో పెరేజ్ పెరేయ్రా, ఇండియానా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు రాజు చింతల, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి,టీజీఐఐసీ సీఈవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.