calender_icon.png 2 October, 2024 | 5:59 AM

బాసర ఉత్సవాలకు రండి

02-10-2024 01:06:10 AM

మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

నిర్మల్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈ నెల 3 నుంచి 12 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంగళవారం హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేసినట్టు ఇన్‌చార్జి ఈవో విజయరామారావు తెలిపారు.