calender_icon.png 23 October, 2024 | 12:59 AM

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలంటూ రోడ్డెక్కిన విద్యార్థులు

12-08-2024 02:30:38 PM

జగిత్యాల: గత మూడేళ్లుగా నిలిచిపోయిన తమ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి తమ చదువులకు ఆటంకం ఏర్పడకుండా చూడాలని కోరుతూ జిల్లా కేంద్రమైన జగిత్యాలలో  పలు డిగ్రీ కళాశాలల విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం జగిత్యాల కొత్త బస్టాండ్ నుండి తహసీల్ చౌరస్తా వరకు విద్యార్థులు ర్యాలీగా నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ చదువులకు ఆటంకం కలుగకుండా వెంటనే స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి తమ ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం లేకుండా దోహదపడాలని విద్యార్థులు కోరారు.