calender_icon.png 4 February, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

04-02-2025 12:00:00 AM

నిజామాబాద్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శిం చారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు.

ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో  బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు.

ఎమ్మె ల్సీ ఎన్నికలను పురస్కరించుకుని అందు బాటులో ఉన్న బ్యాలెట్ బాక్సుల గురించి ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్ని మాపక శాఖ అధికారి నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.